TELANGANAPATRIKA (June 22), అక్రమ ఇసుక రవాణా.. జమ్మికుంట మండలం పరిధిలోని విలాసాగర్, కొండపాక గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా మళ్లీ వేగం పుంజుకుంది.నంబరు ప్లేట్లను తొలిగించిన ట్రాక్టర్ల ద్వారా పట్టపగలే పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ దందా స్థానికుల కళ్లకు కన్పిస్తున్నా, సంబంధిత అధికారుల స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎవరెవరు ఈ అక్రమ వ్యాపారానికి మద్దతుగా ఉన్నారో బయటపెట్టాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని, నంబరు ప్లేట్లు లేని ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu