Sirisinagandla Seetha Ramachandra Swamy: నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని శిరసనగండ్ల గ్రామంలో అయోధ్య నగరం గుట్ట ఏకశిలా కొండ పైన 300 ఫీట్ల ఎత్తులో సీతారామచంద్రస్వామి దేవస్థానం 60 ఎకరాల విస్తరణలో ఉంటుంది. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో రాచకొండ పద్మ నాయకుల కాలంలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయనికి చరిత్ర ఉన్నది. ఈ సీతారామచంద్ర దేవాలయానికి దక్షిణ రెండో అపర భద్రాద్రి అని పేరు ఉంది. శిరసనగండ్ల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5వ తారీఖు నుండి 12వ తారీకు వరకు జరుగుతాయి. శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా సిరిసినగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం ముస్తాబ్ అయ్యింది.

బ్రహ్మోత్సవాలకి ముస్తాబైన ఆలయం

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ చరిత్ర ప్రకారం
పూర్వం ఒకానొక సమయంలో దేవాలయం ఉన్నచోట పోచమ్మ అమ్మవారు ఉండేది. నిత్యం డేరం రామయ్య జి పూజలు చేస్తూ ఉండేవారు అప్పుడు సాక్షాత్తు సీతారామచంద్ర వారు స్వప్నంలో దర్శనమయ్యే ఖమ్మం జిల్లా పాల్వంచ గ్రామంలో కాకర చెట్టు కింద రాములవారు సీతమ్మ, లక్ష్మణ వారు అక్కడే ఉండేవారు. సీతారామచంద్ర స్వామిని శిరిసనగండ్ల తీసుకొచ్చి ప్రతిష్టమని చెప్పేసి స్వప్నలో చెప్తే ఇక్కడ ఉన్నటువంటి రామయ్య జి గ్రామంలో ఉన్న ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇదే విషయం చెప్తాడు. ప్రజలందరూ రామయ్య జి మాటల మీద నమ్మకం కలగలేదు. అప్పుడు సాక్షాత్తు రామేజీ ఎవరికైతే చెప్పారో వారి కలలోకి సీతారామచంద్రస్వామి వచ్చి నిజంగా ఇక్కడ సీతారామచంద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి అవి తీసుకొచ్చి లో ప్రతిష్టించండి అని చెప్పడం జరిగిందని ప్రజల నమ్మకం. అప్పుడు ప్రజలందరూ నమ్మి ఎడ్లబండ్లు కట్టుకొని ఖమ్మం జిల్లాకు వెళ్లి అక్కడ ఒక బ్రాహ్మణి యొక్క గృహంలో తాకర చెట్టు కింద పొదలో బాయి లోతుగా తీస్తూ ఉంటే అప్పుడు రాములవారు సీతమ్మవారు లక్షల వారు మూడు విగ్రహాలు మాత్రమే కనిపించాయి, ఎడ్లబండ్లో ఆ మూడు విగ్రహాలను తీసుకువస్తుంటే సిరిసినగండ్ల ఉన్నటువంటి పోచమ్మ వారు వారందరికీ కూడా భయభ్రాంతులను చేస్తూ ఉంటుంది. నేను ఉన్న చోట వారిని ఎందుకు తీసుకొస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు సాక్షాస్తు రాములవారు ఇక్కడి ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ ఉండాలని అనుకుంటున్నా అని చెబితే పోచమ్మకు ఎంతకు వినిపించుకోలేదు అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చి తన బాణంతో పోచమ్మ అమ్మవారిని ముక్కు కోస్తాడు, అప్పుడు రాములవారు పోచమ్మ తల్లిని, లక్ష్మణునికి శాంతపరచి రాములవారు పోచమ్మ తల్లి తో మీ దర్శనం తర్వాతే నా దర్శనం మీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు నైవేద్యం ఉంటుంది అని అబయం ఇస్తాడు. ఆభయం ఇచ్చిన తర్వాత పోచమ్మవారు శాంతి చేసుకుని నైరుతి భాగంలో ముక్కిడి పోచమ్మ విరాజుల్లుతోంది. సిరిసనగండ్ల గుట్టకి 60 ఎకరాల సువిశాల మైనటువంటి ఏకశిల కొండపైన సీతారామచంద్రస్వామి వెలవడం విశిష్టత సీతారామచంద్ర స్వామి వారు రాజులకు సంబంధించినటువంటి రాజవంశం కాబట్టి శీర్షణగండ్ల లో వెలిసిన శ్రీరాముడికి మీసం ఉండడం ఒక ప్రత్యేకత. సీతమ్మవారు శ్రీరాములు వారి దిక్కు వార చూపులతో చూస్తూ ఉండటం అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం వెనకటికి భర్త వైపు భార్య ఎదురుగా ఉండి చూడకపోవడం అలాంటి హిందూ సంప్రదాయానికి పతికంగా చెప్పినటువంటి విగ్రహంల సీతమ్మ వారు ప్రజలకు కనిపిస్తోంది.

ఈ సిరిసినగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఒక స్తంభం మీద ఉన్నటువంటి లిపిలో 14వ శతాబ్దం లో వెలిసినట్టుగా రాసి ఉంటుంది. ప్రతి శ్రీరామనవమికి వసంత ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగే అటువంటి ప్రదేశం తెలంగాణలో సిరిసిల్లగండ్ల రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి ఆలయం అని చెప్పవచ్చు. అలాగే నిత్యం శ్రీరామనవమికి పతి ఎట ఉత్సవాలు అత్యంత వైభవంగా 16 రోజుల పాటు పెళ్లి వేడుకలు చేయడం జరుగుతుంది. చైత్ర శుద్ధ పాడేము నుండి చైత్ర శుద్ధమైన వరకు వసంత ఉత్సవాలు చైత్ర శుద్ధ అష్టమి నుండి చైత్ర బహుళ పంచమి వరకు సీతారామచంద్రస్వామి వివాహ వేడుకలు అత్యంత రమణీయ శోభయమానంగా జరగడం విశేషం.
రెండో భద్రాద్రిగా పేరుగాల్సిన సిరినగండ్ల
Read more: Praja palana – పేదలకు సమృద్దిగా సన్న బియ్యం పంపిణీ