Gadwal Sc Hostel: జోగులాంబ గడ్వాల్ జిల్లాలోని ఒక ఎస్.సి హాస్టల్లో అల్పాహారంగా ఇచ్చిన ఉప్మాలో పురుగులు కనిపించడంతో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అల్పాహారంలో పురుగులు… విద్యార్థులకు అస్వస్థత
హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఉదయం ఉప్మా, అరటిపండ్లు, బిస్కెట్లు అందించారు. ఉప్మా తిన్న తర్వాత కొంతమంది విద్యార్థులు అందులో పురుగులు కనిపించాయని ఫిర్యాదు చేశారు. అలాగే కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం.
తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
స్థితి తీవ్రమవుతుందని భావించిన హాస్టల్ స్టాఫ్, టీచర్లు వెంటనే విద్యార్థులను గడ్వాల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. వైద్యుల నివేదిక పరిస్థితి స్థిరంగా ఉంది. విద్యార్థులందరినీ పరీక్షించిన వైద్యులు, ఎటువంటి ప్రాణాపాయం లేదని, అందరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. అనుమానాస్పద ఆహారం కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Gadwal Sc Hostel ఈ ఘటనపై తల్లిదండ్రుల్లో ఆందోళన
హాస్టల్లో భోజన నాణ్యతపై పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం, హాస్టల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
