Cyclone Montha Effect: మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్షాల ముసురులో మునిగిపోయింది. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల్లో అధికారులు రేపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

సెలవు ప్రకటించిన జిల్లాలు
యాదాద్రి భువనగిరి, హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో స్కూళ్లకు రేపు సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు నిర్ణయించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రాథమికం నుంచి హై స్కూల్ వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని సూచించారు.
ఇతర జిల్లాల్లో పరిస్థితి
అటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు భద్రత కారణంగా సెలవు ప్రకటించాలని స్థానిక అధికారులను కోరుతున్నారు.
Cyclone Montha Effect అధికారుల హెచ్చరిక
వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించింది.మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్షాల ముసురులో మునిగిపోయింది.
Read More: Read Today’s E-paper News in Telugu


Comments are closed.