Crop Loss 2025: అకాల వర్షంతో అతలాకుతలం తడిసి ముద్దవుతున్న జొన్నలు!

Crop Loss 2025 adilabad latest news 1

వ్యవసాయ మార్కెట్ వద్ద తడిసి ముద్దయిన జొన్నలు నష్టపోయామని రైతుల ఆవేదన

Join WhatsApp Group Join Now

తడిసిన జొన్న లను కొనాలని డిమాండ్…

అకాల వర్షం అదిలాబాద్

జిల్లా రైతన్నను అతలాకుతలం చేసింది. బుధవారం నుండి మొదలైన వర్షం గురువారం కూడా దంచికొట్టింది. ఫలితంగా జొన్న కొనుగోలు సెంటర్ల వద్ద ఆరబెట్టిన, బస్తాల్లో నింపిన జొన్న తడిసి ముద్దయ్యాయి. జిల్లా కేంద్రంతోపాటు , బోథ్ నియోజకవర్గం తో పాటు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తడిసిన జొన్న ను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బేల, జైనథ్, తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేల మం కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న జొన్నలు తడిసిపోయాయి.

Crop Loss 2025 కొనుగోళ్లు ఆలస్యంతోనే తిప్పలు

దండేపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. పాటు గురువారం కూడా అలాగే దంచికొట్టిన వర్షం.. దీంతో కళ్లాల్లో ఉన్న జొన్న కుప్పల్లోకి నీరు చేరింది. కుప్పలపై ప్లాస్టిక్ కవర్స్ కప్పినా వరద కుప్పల్లోకి చేరింది. జొన్నల కొనుగోళ్లు ఆలస్యమవడంతోనే సెంటర్ల వద్ద ఉన్న జొన్నలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు… అధికారులు సరైన ఏర్పాట్లు చేయయకపోవడంతో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయిందని ఆరోపిస్తున్నారు… ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు…

Read More: కవిత సంచలన లేఖ: మాజీ సీఎం తన తండ్రి కి 7 పేజీల లేఖ..!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.