Karimnagar Politics 2026: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీకి ఘన విజయం అందించారు.

Karimnagar Politics 2026: ధర్మపురి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి **అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ధర్మపురి మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుని ప్రత్యర్థి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కనీయలేదు.
అదే విధంగా మంథని మున్సిపాలిటీలో ఐటీ, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 13 వార్డుల్లో 11 గెలుచుకుని ఆధిపత్యాన్ని చాటుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహం వరకు మంత్రి స్వయంగా పర్యవేక్షించడం విజయానికి దోహదపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హుస్నాబాద్ మున్సిపాలిటీలో బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 20 వార్డుల్లో 16 గెలుచుకుంది. మిగిలిన నాలుగు వార్డులను బీఆర్ఎస్ సాధించింది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చిన ఈ ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి బలాన్ని మరింతగా పెంచినట్లు సూచిస్తున్నాయి. ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సానుకూల స్పందన చూపినట్లుగా ఈ ఫలితాలు భావిస్తున్నారు.
