TELANGANAPATRIKA (June 24): Collector Ila Tripathi. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకం కింద కేవలం 9 రోజుల్లో రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా, మంగళవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న “రైతు భరోసా సంబరాలు” కార్యక్రమానికి నల్గొండ జిల్లాలోని 200 మంది రైతులు బయలుదేరి వెళ్లారు.

Collector Ila Tripathi జెండా ఊపి ప్రారంభం..
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతుల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులంతా రైతులను అభినందించారు.
పాల్గొన్న అధికారులు:
జే. శ్రీనివాస్ – రెవెన్యూ అదనపు కలెక్టర్
నారాయణ అమిత్ – స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్
శ్రవణ్ – జిల్లా వ్యవసాయ అధికారి
అనంతరెడ్డి – జిల్లా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్
ఇతర వ్యవసాయ శాఖ అధికారులు
Read More: Read Today’s E-paper News in Telugu