కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్: జిల్లా లో భూ భారతి పై అవగాహనా కార్యక్రమాలు …!

TELANGANA PATRIKA(MAY30) , కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , కామారెడ్డి జిల్లా, పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ భారతి కార్యక్రమాన్ని నిర్వహించిన అనుభవాలను జిల్లాలోని మిగతా మండలాల్లోని రెవిన్యూ సిబ్బందికి వివరించడానికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర భూ పరిపాలన కమీషనర్ నవీన్ మిట్టల్ పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన భూ భారతి కార్యక్రమం పై నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత జిల్లాలోని లింగంపేట్ మండలంలో భూ భారతి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన పై కమీషనర్ సమీక్షించారు.

Join WhatsApp Group Join Now

ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.,

మండలంలో 4225 దరఖాస్తులు రావడం జరిగాయని, వచ్చిన దరఖాస్తులపై కలెక్టర్ వివరించారు.
ఆమోదం తెలిపిన వాటిలో విజయగాధలు తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వి.విక్టర్ పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *