TELANGANAPATRIKA (June 21): Chlorohydrate Seized in Nirmal. నిర్మల్ జిల్లాలో బైంసా రహదారిపై చిట్యాల వద్ద ఉన్న మారుమూల ప్రాంతంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన కల్తీ కల్లు తయారీ యూనిట్పై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ భారీ దాడి నిర్వహించింది. ఈ దాడిలో 425 కిలోల క్లోరోహైడ్రేడ్, 1 కిలో ఆల్ఫాజోలం, రెండు కార్లు, ఐదుగురు వ్యక్తులు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Chlorohydrate Seized in Nirmal క్లోరోహైడ్రేడ్ – ప్రమాదకర రసాయనం
కల్తీ కల్లు తయారీలో ప్రధానంగా వినియోగించే క్లోరోహైడ్రేడ్ పదార్థాన్ని ముంబై నుంచి దిగుమతి చేసి, నీటిలో కలిపి గుంతల్లో ఐస్ తో గడ్డకట్టించి 10 రోజుల తర్వాత రసాయనంగా మార్చి విక్రయించేవారని నిందితులు అంగీకరించారు. అదే విధంగా ఆల్ఫాజోలం అనే నిద్రమాత్రల పదార్థాన్ని కూడా కల్తీకల్లు తయారీలో ఉపయోగిస్తున్నట్టు సమాచారం.

Chlorohydrate Seized in Nirmal అరెస్ట్ అయిన వారు
ఈ యూనిట్ను ఏర్పాటు చేసిన వారు : బుర్ర రమేష్ గౌడ్ ,రామా గౌడ్ ,
తయారీ పర్యవేక్షణలో ఉన్న వారు: శ్రీనివాస్ గౌడ్ ,రాజశేఖర్ గౌడ్ ,రాజు గౌడ్
ఇవాళ వీరంతా ఐదు సెల్ ఫోన్లు, 17 క్లోరోహైడ్రేడ్ బ్యాగులు, 1 కేజీ ఆల్ఫాజోలం, రెండు కార్లు సహా ఎస్టిఎఫ్ పోలీసులచే అరెస్ట్ చేయబడ్డారు.
ఈ దాడిలో పాల్గొన్న ప్రధాన అధికారులు:
రూ.10 లక్షల విలువ చేసే డ్రగ్ను స్వాధీనం చేసిన ఎస్టిఎఫ్ బి టీం లీడర్ ప్రదీప్ రావు , టీజీ న్యాబ్ నుండి రూపేష్ ఐపిఎస్,సిఐలు రమేష్ , పూర్ణేశ్వర్, రంగస్వామి, ఎస్ఐలు బాలరాజు, నితిన్ కౌశిక్, పాలూరు సిబ్బంది
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశంస
కల్తీ కల్లు తయారీ యూనిట్ను అడ్డుకున్నందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కల్తీ పదార్థాలను నిలువరించడంలో ఇది పెద్ద విజయంగా గుర్తిస్తున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి:
కల్తీ కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు ఉంటాయి. ఎటువంటి అనుమానం ఉన్నా ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి.

Read More: Read Today’s E-paper News in Telugu