
వర్షాకాలం రాకముందే .. మత్తడి దూకుతున్న చెక్ డ్యాములు..
TELANGANA PATRIKA(MAY28) , జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలం, గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల ప్రభావంతో కొడిమ్యాల మండలంలోని ఐదు చెక్ డ్యాములు నిండి పొర్లుతున్నాయి. ఎత్తిపోతల ద్వారా మరియు గ్రావిటీ పైపుల ద్వారా ఈ నీరు పొలాలకు చేరడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు.
వర్షాన్ని సద్వినియోగం చేసేందుకు సన్నద్ధత
ఈ డ్యాములు పొర్లడం వలన గ్రామ ప్రజలు, ముఖ్యంగా రైతులు పత్తి, మొక్కజొన్న, కంది, పెసలు, పచ్చిరొట్ట వంటి వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తిలోనే ఈ విత్తనాలను వేయాలని నిర్ణయించుకున్నారు. వరిపంట నార్లు వేయడం కూడా ఇప్పటికే ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధంగా ఉన్నారు.
చెక్ డ్యాములు తిరిగి జీవం పోస్తున్న ప్రకృతి
గతంలో కురిసిన వర్షాలతో కొంత నీటి నిల్వ ఉన్నప్పటికీ, తాజా వర్షాలు డ్యాములను పూర్తిగా నింపడంతో సాగుకు మంచి అనుకూల వాతావరణం ఏర్పడింది. ప్రకృతి ప్రేరిత వ్యవసాయం అన్నమాటకు నిదర్శనంగా ఈ పరిస్థితిని రైతులు భావిస్తున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu