భూభారతి చట్టం జూన్ 3 నుంచి రెవిన్యూ సదస్సులు – భూ సమస్యల పరిష్కారానికి రైతులకు అవకాశం..!

TELANGANA PATRIKA(JUN 1) , కొత్త భూభారతి చట్టం ప్రకారం జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తుర్కపల్లి మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ దేశ్య నాయక్ తెలిపారు. ఈ సమావేశాల ద్వారా గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Join WhatsApp Group Join Now

భూభారతి చట్టం రెవిన్యూ సదస్సులు గ్రామాల వారీగా షెడ్యూల్:

  • జూన్ 3 – నాగాయపల్లి, గోపాలపురం
  • జూన్ 4 – కొండాపురం, శ్రీనివాసపురం
  • జూన్ 5 – వాసాలమర్రి, తిరుమలాపురం
  • జూన్ 9 – మాదాపురం, చిన్న లక్ష్మాపురం
  • జూన్ 10 – తుర్కపల్లి, మల్కాపూర్
  • జూన్ 11 – కోమటికుంట, వెంకటాపూర్, దత్తాయిపల్లి
  • జూన్ 12 – ఇబ్రహీంపురం, కోనాపురం
  • జూన్ 13 – వేల్పుపల్లి, ధర్మారం
  • జూన్ 16 – రూస్తాపురం
  • జూన్ 17 – గంధ మల్ల
  • జూన్ 18 – వీరారెడ్డిపల్లి
  • జూన్ 19 – ములకలపల్లి
  • జూన్ 20 – పల్లె పహాడ్

రైతులకు సూచనలు:
రైతులు తమ భూములపై ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాల్లో జరిగే రెవిన్యూ సదస్సుల్లో హాజరై, తగిన ఆధారాలతోపాటు దరఖాస్తులు సమర్పించాలని తహసీల్దార్ సూచించారు.

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →