తెలంగాణ పత్రిక (APR.16), Bhainsa Bharosa Center: మంగళవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
Bhainsa Bharosa Center సత్ఫలితాలు ఇస్తున్న కౌన్సిలింగ్ లు-ఒకటవుతున్న జంటలు
క్షణికావేశంలో దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్న ఎన్నో జంటలను భరోసా సెంటర్ ద్వారా అనుభవజ్ఞులైన కౌన్సిలింగ్ ఇచ్చేవారిచేత విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎన్నో జంటలను కలిపేలా మళ్ళీ వారి జీవితంలో నవ్వుల పువ్వులు పూయించేలా నిర్మల్ జిల్లా ఎస్పి డాక్టర్. జి. జానకి షర్మిల నేతృత్వంలో పోలీసులు నిర్వహిస్తున్న భరోసా సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ లు మంచి సత్ఫలితాలను ఇస్తోంది. గతంలో జిల్లా మొత్తం మీద ఒక నిర్మల్ పట్టణ కేంద్రంలోనే భరోసా సెంటర్ ఉండేదని అయినప్పటికీ వైవాహిక బంధం విలువ తెలియని కొంతమంది క్షణికావేశంలో విడిపోయే పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు వారి కుటుంబ సభ్యులు భరోసా సెంటర్ ను (Bhainsa Bharosa Center) ఆశ్రయించారు. అలా చాలా జంటలకు కౌన్సిలింగ్ లు నిర్వహించి ఇప్పటివరకు 80 జంటలను కలిపి పంపామని తెలిపారు. వారిప్పుడు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారని అందుకు నిర్మల్ భరోసా సెంటర్ పోలీసులకి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు.

మరోవైపు భైంసా లోనూ భరోసా కల్పిస్తున్న “భరోసా సెంటర్” పోలీసులు
ఫిర్యాదుల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న భైంసా సబ్ డివిజన్ పోలీసులు
అలాంటిది భైంసా పట్టణంలోనూ భరోసా సెంటర్ ఉంటే బాగుంటుందని భావించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపిఎస్ భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి దాదాపు విడిపోయే క్షణాల్లో వచ్చిన వారికి కూడా భరోసా సెంటర్ పోలీసులు అక్కున చేర్చుకుని అనుభవజ్ఞులైన కౌన్సిలర్స్ చేత మళ్లీ వారి వివాహ బంధానికి అర్ధాన్ని తెలిపేలా ఒకటి చేస్తూ ఎన్నో జంటలను ఏకం చేస్తున్నందుకు జిల్లా భరోసా సెంటర్ పోలీసులను ఎస్పీ జానకి షర్మిల ప్రశంసించారు. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమం ముగిసిన తర్వాత భరోసా సెంటర్ ద్వారా కలిసిన జంటను దగ్గరికి తీసుకుని వైవాహిక బంధం విలువ, దాంతోపాటు క్షణికావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తూ కలిసిపోయిన ఆ జంటను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్మల్ జిల్లా పోలీసులు ఎప్పుడు తమకు అండగా ఉండడంతో పాటు భరోసా కల్పిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలిపారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు సమస్యలు పరిష్కారం ఏప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు నైలు, గోపినాథ్, మల్లేష్, ఎస్ఐ లు శంకర్, గౌస్, గణేష్ మరియు భరోసా సెంటర్ సిబ్బంది జ్యోతి, శిరీష, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు.
Read More: Adilabad 2025: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం-ఆత్రం సుగుణక్క
ఎస్పీ గారి పేరు తప్పుగా పడింది sir.. ఎస్పీ గారి పేరు హెడ్డింగ్ లో “డా. జి. జానకీ షర్మిల” కి బదులు “ఎస్పీ శిల్ప” అని పడింది. దయచేసి సరిచేయగలరు..
updated thanks for your feedback
——————
*భూ సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా భూభారతి*
తెలంగాణ పత్రిక ఏప్రిల్ 16
*నేటి నుంచి పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు*
*ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు*
*మద్దూర్ మండలంలో ప్రారంభించనున్న రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*హైదరాబాద్* :-
భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా భూభారతి చట్టాన్నితీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందన్నారు. భూభారతి అవగాహన సదస్సులపై గురువారం నాడు ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు.
ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో రేపటినుంచి ( 17వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామని అలాగే భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసే నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. నారాయణ్పేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ను తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆతర్వాత వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో జరిగే అవగాహనా సదస్సులో పాల్గొంటానని చెప్పారు. 18వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురంలో ఉదయం జరిగే రెవెన్యూ సదస్సులోనూ, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోనూ జరిగే సదస్సులో పాల్గొంటానని మంత్రి పొంగులేటి తెలిపారు.
రాష్ట్రంలోని నారాయణ్పేట్ జిల్లా మద్దూర్ మండలంతోపాటు , ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈచట్టాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రయోగాత్మకంగా భూభారతిని అమలు చేసే ఈ నాలుగు మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రశీదులను అందజేస్తారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫార్మేట్ లో తయారుచేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందురోజే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి భూసమస్యలు ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటి ఏవిధంగా పరిష్కరించాలి, రానున్న రోజులలో చేపట్టాల్సిన చర్యలు, భూభారతి పోర్టల్పై ప్రజాస్పందనను చూసి భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూముల మినహా ప్రతి దరఖాస్తును మే 1వ తేదీ నుంచి పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఏరోజుకారోజు కంప్యూటర్ లో నమోదు చేసి ఆయా సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు.
ఒకవైపు నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ అవగాహన సదస్సులకు సంబంధించి కలెక్టర్లు ప్రతిరోజూ ప్రతి మండలంలో రెండు కార్యక్రమాలలో పాల్గొనేవిధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మండల కేంద్రాల్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ రెవెన్యూ ఇనస్పెక్టర్ , సర్వేయర్ తదితర అధికారులతో బృందాలుగా ఏర్పడి సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ అవగాహనా సదస్సులు పూర్తైన తర్వాత ఆ నాలుగు మండలాలలో నిర్వహించిన మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.