TELANGANA PATRIKA(JUN 7) , Fake ST Claims , ఇచ్చోడలో బంజారా సంఘం ఆగ్రహం ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జరిపిన మీడియా సమావేశంలో, గజానంద్ చౌహాన్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించింది.


Fake ST Claims ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినా…
బంజారా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దేవానంద్ చౌహాన్ కుటుంబం ఎస్టీ కాదని స్పష్టంగా నిరూపితమైందని, అయినప్పటికీ ఆయన మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి తాను లంబాడా కులానికి చెందినవాడినని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని సిగ్గుచేటుగా అభివర్ణించారు.
సంఘం నేతల ఆరోపణలు
బోథ్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ నరేందర్ నాయక్ మాట్లాడుతూ, ఇటువంటి అసత్య ప్రదర్శనలు బంజారా సమాజానికి అవమానకరమని అన్నారు.
కార్యవర్గ సభ్యులు ఆడే మానాజీ గజానంద్ తప్పుడు ధ్రువపత్రాలు, డబ్బుతో కొనుగోలు చేసినట్లు ఆరోపించారు.
గ్రామ పెద్ద రాథోడ్ శివలాల్ నాయక్ మాట్లాడుతూ, వారి కుటుంబం మహారాష్ట్రలో నివాసం ఉండి రేషన్ కార్డులపై తప్పుడు పేర్లతో ఎస్టీ సర్టిఫికెట్లు తీసుకున్నారని వివరించారు.
మొదటి మరియు రెండవ కుమార్తెల వివాహాలు మహారాష్ట్ర వాసులతో జరిగి వారి పిల్లలకు కూడా “చవాన్” ఇంటిపేరుతో తప్పుడు ధ్రువపత్రాలు పొందినట్లు పేర్కొన్నారు.
పాల్గొన్నవారు
ఈ సమావేశంలో రిటైర్డ్ టీచర్ లావుడ్య రాములు, జాదవ్ బలిరామ్ నాయక్, జాదవ్ రమేష్, జాదవ్ వినంత్ రావ్, చౌహాన్ సాయిరాం, రాథోడ్ అంబుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu