AP Telangana Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మండిపోతున్న ఎండల కారణంగా గత రెండు రోజుల్లోనే దాదాపు 40 మంది వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరిలో తెలంగాణలోనే సుమారు 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత విషమంగా మారింది. కేవలం 48 గంటల్లోనే 16 మంది వడదెబ్బతో మరణించారు. గురువారం 9 మంది, శుక్రవారం మరో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొన్న ఓ గుర్తుతెలియని యాత్రికుడు కూడా ఎండ తీవ్రతతో మృతి చెందగా, జార్ఖండ్కు చెందిన భుయాన్ వినోద్ అనే వ్యక్తి కూడా వడదెబ్బ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు.
AP Telangana Heatwave Alert ఖమ్మం జిల్లాలో 12 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటగా, పల్లిగూడెంలో అత్యధికంగా 46.3 డిగ్రీలు నమోదయ్యాయి.
ఎండల ప్రభావం మనుషులకే కాకుండా పశువులపై కూడా పడుతోంది. మెదక్ జిల్లాలో ఓ ఎద్దు కూడా తీవ్ర ఎండల కారణంగా మృతి చెందినట్లు సమాచారం.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో పది మంది వరకు వడదెబ్బతో మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో కూలీలు, బిచ్చగాళ్లు వంటి నిరుపేద వర్గాలకు చెందినవారు ఉన్నారు.
AP Telangana Heatwave Alert continues for 5 days
అధికారులు మరో ఐదు రోజుల పాటు తీవ్ర హీట్వేవ్ కొనసాగనున్నట్లు హెచ్చరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
