
తెలంగాణ పత్రిక (APR.10),Adilabad 2025: ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చర్యల్లో భాగంగా డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఆసుపత్రుల్లోని రేట్ చార్ట్, రికార్డులు, ఫైర్ సేఫ్టీ, లైసెన్స్, డాక్టర్ల సర్టిఫికెట్లు, తదితర అంశాలను పరిశీలించారు. అలాగే పలు మెడికల్ షాపులను కూడా తనిఖీ చేశారు.

Adilabad డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ:
ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇటీవలి రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రులపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో అనేక నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు.
- మందులు కొంటే రిసిప్ట్ ఇవ్వరు.
- అడిగితే “యంత్రాలు చెడిపోయాయి” అని చెప్పడం.
- మ్యాన్యువల్ అడిగితే “బుక్లెట్లు లేవు” అంటారు.
- ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
తనిఖీల అనంతరం ఆయా ఆసుపత్రుల నిర్వాహకులకు అవసరమైన సూచనలు అందించారు. నిబంధనలను విధిగా పాటిస్తూ, నాణ్యమైన సేవల్ని ప్రజలకు అందించాలని డిఎంహెచ్ఓ సూచించారు.
Read more: Read Today’s E-paper News in Telugu
One Comment on “Adilabad 2025: ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కు పాదం.”