Sub Registrar Raid: సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

Sub Registrar Raid: సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు5, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భీమదేవరపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం పై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డి.ఎస్.పి సాంబయ్య విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చేవారి నుండి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రాగా తనిఖీలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల నుండి 96,870 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాడు ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2023-2024 సంబంధించిన డాక్యుమెంట్ పత్రాలు ఇప్పటివరకు ప్రభుత్వానికి సమర్పించలేదనే విషయం ఈరోజు జరిగిన తనిఖీల్లో వెల్లడైందని ఆయన తెలిపారు.

Join WhatsApp Group Join Now

Sub Registrar Raid 2025 june

అనుమతి లేకుండా డాక్యుమెంట్ రైటర్ లకు కార్యాలయంలో కి రావడం చట్ట విరుద్ధమని కానీ అందుకు విరుద్ధంగా డాక్యుమెంట్ రైటర్లు ఏదేచగా అధికారులతో కుమ్మక్కై సాఫీగా వారి వారి పనులను చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయంలో జరుగుతున్న పనులపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరుగుతుందని డిఎస్పి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలను ప్రభుత్వ అధికారులు డబ్బుల కోసం ఇబ్బందులు గురి చేస్తే తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఇంకా పూర్తి తనిఖీలు జరుగుతున్నాయని అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎస్ రాజు, ఎల్ రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics. he specialises in crafting simple, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *