Lionel Messi Hyderabad Event: ఫుట్బాల్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా, లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్కు ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

“GOAT Tour Hyderabad” అడ్వైజర్ పార్వతి రెడ్డి మీడియాకు తెలియజేసిన వివరాల ప్రకారం, మెస్సీ ఈ సందర్బంగా ప్రత్యేక 20 నిమిషాల మ్యాచులో తన స్కిల్స్ను ప్రదర్శించనున్నారు. సింగరేణి RR మరియు అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్లాన్ చేశారు. మ్యాచ్ ముగింపుకు ఐదు నిమిషాల ముందే మెస్సీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్లలో చేరి ప్రేక్షకులను అలరించనున్నారు.
తరువాత, యునిసెఫ్ అంబాసిడర్గా ఉన్న మెస్సీ స్థానిక పేద పిల్లలు మరియు యువ ప్రతిభావంతులకు ప్రత్యేక ఫుట్బాల్ క్లినిక్ నిర్వహించనున్నారు. అనంతరం మెస్సీ పరేడ్ కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Lionel Messi Hyderabad Event అత్యంత ఆసక్తికర భాగం స్టార్ ఆటగాళ్లు లూయిస్ సువారేజ్ మరియు రోడ్రిగో డీ పౌల్ కూడా హాజరుకానున్నారని ప్రకటించారు. దీంతో ఈ ఈవెంట్ మరింత గ్రాండ్గా మారనుంది.
ప్రేక్షకుల ప్రవేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. టికెట్లు District by Zomato యాప్లో రూ.1300 నుండి డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఈవెంట్ కోసం తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం, నిర్వాహకులు అన్ని విభాగాలతో కలిసి కఠిన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. స్టేడియంలో అభిమానులను గైడ్ చేయడానికి 1000 మంది వాలంటీర్లు ఉంటారు.
ఫలక్నుమా ప్యాలెస్లో సుమారు 100 మంది కోసం మెస్సీతో ప్రత్యేక ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్క ఫోటో పాస్ ధర రూ.9 లక్షలు.
మెస్సీ టూర్లో కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ అనే నాలుగు నగరాలు చేరాయి. హైదరాబాద్ ఈవెంట్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Read More: Read Today’s E-paper News in Telugu
