TELANGANAPATRIKA (June 26): ACB raids Peddapalli RTO office . తెలంగాణ పత్రికకు అందిన సమాచారం ప్రకారం, వినియోగదారుల నుంచి నేరుగా కాకుండా ఏజెంట్ల ద్వారా లంచాలు తీసుకుంటున్నారన్న సమాచారం ఆధారంగా, కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం సోదాలు జరిగాయి.

ACB raids Peddapalli RTO office ఏజెంట్లు అదుపులోకి – కార్యాలయం సీజ్
ఏసీబీ బృందం ఆర్టీవో కార్యాలయానికి చేరుకున్న వెంటనే, పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బయటివారిని లోనికి అననివ్వకుండా, లోపలివారిని బయటకు రానివ్వకుండా తాళాలు వేసి దర్యాప్తు చేశారు.
సెల్ఫోన్లు స్వాధీనం – లావాదేవీలపై విచారణ
ఏజెంట్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, “ఏ పనికి ఎంత డబ్బు?” అనే సమాచారం సేకరిస్తున్నారు. ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు, అధికారుల డ్రైవర్లు కూడా అదుపులోకి తీసుకున్నారు.
వాహన ధ్రువీకరణ, ఇతర సేవలలో అవినీతిపై ప్రశ్నలు
రాష్ట్రంలో ఆర్టీవో కార్యాలయాలపై విశ్వసనీయ సమాచారం ఆధారంగా కొనసాగుతున్న ఈ దాడుల్లో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ట్రాన్స్ పోర్ట్ అధికారి కార్యాలయాలు కూడా తనిఖీ చేస్తూ, అధికారులు విచారణకు దారి తీస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu