TELANGANAPATRIKA (June 26): Tirumalagiri RTO ACB raid. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక బృందాలు గురువారం ఉదయం కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. అక్కడ తరచూ ఏజెంట్లు అక్రమ రీతిలో రిజిస్ట్రేషన్లు, ఆర్ సి బుక్స్, వాహన ధ్రువీకరణ పత్రాలతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలకు దిగారు.

Tirumalagiri RTO ACB raid 20 మందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ
ఈ దాడుల్లో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, 20 మంది ఏజెంట్లు అదుపులోకి తీసుకోబడ్డారు. సోదాల సందర్భంగా 50 పైగా ఆర్సీ బుక్స్, అనేక వాహన ధ్రువీకరణ పత్రాలు, సెల్ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
ఏసీబీ ఎప్పటికప్పుడు నిఘా..
ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏసీబీ యంత్రాంగం మరింత పటిష్టంగా నడుస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవినీతి అడ్డుకోవడానికి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu