TELANGANAPATRIKA (June 18): Formula-E Case : ఫార్ములా-ఈ రేసు కేసు లో ఎసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) తన ఫోన్లు అందజేయాలన్న ఆదేశాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను లిఖిత పూర్వక సమాధానం పంపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో కేటీఆర్ అభిప్రాయపడుతూ, “వారి వద్ద ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అనేది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే” అన్నారు. గోప్యత హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.


Formula-E Case ఫోను ఇప్పటికే మార్చేశానన్న కేటీఆర్
కేటీఆర్ తెలిపిన ప్రకారం, తాను 2024 ప్రారంభంలోనే తన ఫోన్ మార్చినట్టు తెలిపారు. ఫార్ములా-ఈ రేసింగ్ జరిగిన సమయంలో వాడిన ఫోన్ ఇప్పుడు తన వద్ద లేదని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతుండగా, ఇటీవల ఏసీబీ అధికారులు కేటీఆర్ కు “ఇవాళ్టి లోపు ఫోన్లు అందజేయాలి” అని సూచించారు.
రాజకీయ స్పందనలు వస్తే ఆశ్చర్యం లేదు
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ పరిణామంపై చర్చ మొదలైంది. గోప్యత హక్కు, విచారణ అధికారాల హద్దులు వంటి అంశాలపై వాదోపవాదాలు తలెత్తుతున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu