
TELANGANA PATRIKA(JUN 3) , ఇందిరమ్మ ఇళ్ల పథకం , కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్సార్ ఫంక్షన్ హాల్లో, కెల్లేడు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రతి ఏడాది జరుగుతుందని, ఈ దఫా మంజూరు పొందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులకు తదుపరి దఫాలో తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇళ్ల నిర్మాణానికి వెంటనే ప్రారంభం..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణానికి పూనుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
పాల్గొన్న అధికారులు మరియు నాయకులు
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వరలక్ష్మి, తహసిల్దార్ విజయ్ కుమార్, హౌసింగ్ ఏఈ దుర్గం మహేశ్, మానకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, కార్యదర్శి తిరుమలేష్, మాతంగి సహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu