Peddapalli jilla collector: వృద్ధాశ్రమం నిర్వహణ అవగాహన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పెద్దపల్లి జిల్లాలో వృద్ధాశ్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరెట్ లో వృద్ధాశ్రమం నిర్వహణ అవగాహన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,మహిళా సంఘాలు పొదుపు తదితర విషయాలే కాకుండా సామాజిక సేవకు ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం 70 లక్షల రూపాయల ఖర్చుతో వృద్ధాశ్రమాన్ని నిర్మించామని ఆయన తెలిపారు.వృద్ధాశ్రమంలో నిరాదరణ లో ఉన్న 50 వయోవృద్ధులు మందికి ఆశ్రయం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఆశ్రమాన్ని నిర్వహించటానికి జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల నుండి దరఖాస్తులు కోరగా అర్హతగల సంస్థలు ఏవీ రాకపోవడంతో జిల్లా మహిళా సమాఖ్య వారికి ఈ బాధ్యతను అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు.వృద్ధాశ్రమాన్ని నిర్వహించడమే కాకుండా సంవత్సరానికి సుమారు ఆరు లక్షలు వృద్ధుల కోసం మహిళా సంఘం ఖర్చు చేయడానికి ముందుకు రావడం వారి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుందని కలెక్టర్ అన్నారు.అనంతరం వృద్ధాశ్రమం నిర్వహణ విషయమై జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు తో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు స్నేహ కార్యదర్షి శోభ కోశాధికారి స్వప్న అవగాహన ఒప్పందం పై సంతకం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Peddapalli jilla collector

Read More: Bhu Bharati News: భూభారతి సదస్సుల్లో స్వీకరించిన భూ సమస్యలు పరిష్కరించాలి.

One Comment on “Peddapalli jilla collector: మహిళా సంఘాల ద్వారా వృద్ధాశ్రమం నిర్వహణ 70 లక్షల రూపాయలతో వృద్ధాశ్రమం నిర్మాణం!”