తెలంగాణ పత్రిక, భారత్ సరిహద్దులో శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన తెలుగువాసి వీర జవాన్ మురళి నాయక్ కు మిర్యాలగూడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.


ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ లు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన వీర జవాన్ మురళి నాయక్ వీర మరణం తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.పాకిస్తాన్ తో యుద్ధంలో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు మిర్యాలగూడ జర్నలిస్టుల తరఫున వందనాలు తెలియజేశారు.
వీర జవాన్ మురళి నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వీరునికి జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మహమ్మద్ అస్లాం, అయుబ్, వాడపల్లి రమేష్, నాజిమ్, మహేష్, నరేందర్ రెడ్డి, మట్టయ్య మందా సైదులు, జర్నలిస్టులు జయరాజు, శ్రీను, లక్ష్మణ్, జంగా లక్ష్మణ్, బాలాజీ,కట్టా బాబు, హరీష్, భాస్కర్, నాగచారి, రమేష్, మందా లక్ష్మణ్, వెంకట్, శివ యాదవ్, నాగభూషణం, సుదర్శన్, నరసింహ, రాయించి నాగేష్, ఇటికాల శివ, ఉమర్ రఫీ, యం.భరత్ కుమార్ (తెలంగాణ పత్రిక జిల్లా రిపోర్టర్) తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu