TELANGANA PATRIKA (MAY 11) , Best Psychologist in Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ మానసిక నిపుణుడు కనుకుంట్ల పున్నం చందర్కు “బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డు 2025” లభించింది. హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును మాజీ కేంద్రమంత్రి, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా అందుకున్నారు.


ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా విశిష్ట సేవలందిస్తున్న సైకాలజిస్టులకు ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ ఏడాది ఆ గౌరవాన్ని పున్నం చందర్ అందుకున్నారు.
Best Psychologist in Telangana మానసిక ఆరోగ్యానికి విస్తృత సేవలు
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామ్ చందర్ మాట్లాడుతూ – గత 15 ఏళ్లుగా పున్నం చందర్ ప్రజల మానసిక సమస్యల పరిష్కారానికి వ్యక్తిగత కౌన్సిలింగ్, వర్క్షాపులు, అవగాహన సదస్సుల ద్వారా విశేషంగా సేవలందిస్తూ వస్తున్నారని చెప్పారు. సైకాలజీలో నూతన పద్ధతులు ప్రవేశపెట్టడంలో ఆయన మొదటి వరుసలో నిలిచారని ఆయన పేర్కొన్నారు.
మరింత బాధ్యతగా భావిస్తున్న పున్నం చందర్ Best Psychologist in Telangana
అవార్డు అందుకున్న అనంతరం సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ – “ఈ అవార్డు నా సేవలకు సమాజం ఇచ్చిన గౌరవం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. మానసిక ఆరోగ్యం పై సమాజంలో అవగాహన పెంచేందుకు నా ప్రయత్నాలు కొనసాగుతాయి,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ సైకాలజిస్టులు పాల్గొన్నారు. పున్నం చందర్కి సైకాలజిస్టులు వై ఆంజనేయులు, ఏ.ఈశ్వర్, శ్రీనివాస్, అయ్యప్ప రాము, తిరుమల తదితరులు అభినందనలు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu