తెలంగాణ పత్రిక (APR.26) , జగిత్యాల: సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ రఘు చందర్ గారు తెలిపారు.


సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు.
- వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు
కొందరు ఇతర దేశాలలో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని,అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేయొచ్చన్నారు. అలాంటి వారి పాస్ పోర్టులు, వీసాలను కూడా రద్దు చేయించొచ్చని చెప్పారు. ఇప్పటికే ఇలాంటి పోస్టులను వాట్సాప్,ఫేస్బుక్ ల ద్వారా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. కావున సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల పై ఎలాంటి అనుమానాలైనా సందేహాలైన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని ప్రజా భద్రత,లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతియుత జీవనం గడిపేల చూడడం జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “జగిత్యాల: సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘ”