తెలంగాణ పత్రిక (APR.12), Congress Telangana|భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో, రూ. 20 లక్షల వ్యయంతో NHM నిధుల ద్వారా నిర్మించిన పల్లె దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.


తెలంగాణ పత్రిక (APR.12), Congress Telangana|ఈ సందర్భంగా గ్రామస్తులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు శాలువాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇలా చెప్పారు:
“ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల లేమితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం పల్లె స్థాయిలో ఆరోగ్య సేవలందించేందుకు కృషి చేస్తోంది.”
ఇవే దిశగా రాష్ట్రంలోని మరిన్ని గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటవుతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో వైద్యాధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Read more: Read Today’s E-paper News in Telugu