Karimnagar 2025: కరీంనగర్ – జగిత్యాల రోడ్డుపై రహస్య రవాణా ఘటన వెలుగులోకి!

తెలంగాణ పత్రిక (APR.10), Karimnagar 2025: ప్రమా*దం వల్ల బయట పడ్డ జిలటన్ స్టిక్స్ అక్రమ రవాణా

Join WhatsApp Group Join Now

కరీంనగర్ – జగిత్యాల జాతీయ రహదారి పై గురువారం ఉదయం ఓ సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు, కరీంనగర్ వైపు నుండి వస్తున్న ఆటో గంగాధర వద్ద మధురానగర్ ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఆటో తలకిందులైంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ హుటాహుటిన ఆటోలో నుంచి బయటకి వచ్చి, అందులో ఉన్న రెండు బాక్సులను తీసుకొని పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసి అక్కడినుండి పారిపోయాడు. ఇది స్థానికులను ఆశ్చర్యంలో ముంచింది.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్వలో పడేసిన బాక్సులను పరిశీలించారు. అందులో జిలటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని గంగాధర ఎస్సై తెలిపారు.

Read more: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →