తెలంగాణ పత్రిక(APR 27: CEIR Telangana: CEIR పోర్టల్ నందు నమోదు చేయబడిన 332 మొబైల్స్ రికవరీ.. బాధితులకు అందజేత.CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.జిల్లా పోలీసు కార్యాలయం సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన “మొబైల్ రికవరీ మేళ”లో జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ మాట్లాడుతూ.దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం గత 15 రోజుల క్రితం జిల్లా ఐటి-సెల్ సిబ్బందితో స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి, ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.


CEIR ద్వారా రికవరీ అయిన 332 ఫోన్లు – పోలీసుల వివరాలు:
CEIR పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు నమోదు చేయబడిన 9878 దరఖాస్తులలో 2150 ఫోన్లను గుర్తించి, ఇదివరకే బాధితులకు అందించడం జరిగిందని, ఇందులో గత 15 రోజుల క్రితం ఏర్పాటు చేయబడిన స్పెషల్ టీమ్స్ ద్వారా – 332 సెల్ ఫోన్ లను మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేయడం జరిగందని జిల్లా ఎస్పీవివరించారు. వాటిని ఈ రోజు “మొబైల్ రికవరీ మేళ” కార్యక్రమం ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందన్నారు.మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని ఈ రోజుల్లో మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన సైబర్ నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు.
సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) CEIR పోర్టల్ ను 17-మే-2023 లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు.
జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు, దొంగిలించిన ఫోన్ లను,మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని, దొంగిలించబడిన ఫోన్ అని తెలియక, కొనుగోలు చేసిన అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారు అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలపై అవగాహన అవసరం.
ఆన్లైన్ బెట్టింగ్, బెట్టింగ్ యాప్స్ మాటున సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని గుర్తించాలని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన, ప్రమోట్ చేసిన అట్టి వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. డిజిటల్ అరెస్ట్ అని, కస్టమ్స్ అధికారినని, వీడియొ కాల్స్ వస్తే నమ్మరాదని, సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి అనవసర లింకు లను ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైనట్లైతే వెంటనే 1930 కు కాల్ చేసి గాని, సైబర్ క్రైమ్ (https://www.cybercrime.gov.in) నందు గాని ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీసూచించారు.
ఈ స్పెషల్ టీం నందు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార, టెక్నికల్ అసిస్టెంట్ రాజలింగం, జ్యోతి, భవాని, స్నేహిత, ఇర్ఫాన్ అలీ, హరికృష్ణ, సతీష్, దీపక్, ఉదయ్, మమత, భారతి, ఇందిర, విజయ్, హరీష్ తదితర ఐటి సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Read more: Read Today’s E-paper News in Telugu