Youth Congress Sircilla: ఈరోజు సిరిసిల్ల పట్టణం లో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ RTA మెంబర్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోగుల దేవరాజు రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆనాడు రాహుల్ గాంధీ గారు సెషన్ లో జనగణన తో పాటే దేశం అంతా కూడా కులగణనా చేయాలి దేశం లోని అన్ని కులాల జనాబా ను బట్టి వారి వారికి రిజర్వేషన్లు కల్పించాలి అని మాట్లాడితే ఆయనను హేళన చేశారు కానీ ఇపుడు హేళన చేసిన బీజేపీ పార్టీయై దేశం అంతా కులగణనా చేపట్టాలి అని రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప ఆలోచనకి తలవంచి కులగణనా కి ఆమోదం తెలపడం మా రాహుల్ గాంధీ గారి విజయం అనే చెప్పుకోవాలి అని అన్నారు అలాగే దేశం లోనే మొట్ట మొదటి కులగణనా పూర్తి చేసిన రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రమే అని దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని రేవంత్ రెడ్డి ప్రతిమ అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ గారి చిత్రపటానితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మరియు ఆది శ్రీనివాస్ గార్ల చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు *. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొత్తూరి శివగౌడ్ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షులు నల్ల శ్రావణ్ మరియు కాంగ్రెస్ నాయకులు పైసా ఆంజనేయులు, సబ్బని వేణు, సాధుపల్లి అఖిల్ గౌడ్, నేరెళ్ల కార్తీక్ గౌడ్, ప్రకాష్, మార్గం నాగరాజు, మరియు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Also Read: BC Reservation: దేశవ్యాప్తంగా బీసీల కులగణనను స్వాగతిస్తున్నాం – పర్శ హన్మాండ్లు