TELANGANAPATRIKA (June 16): What is Census in India. దేశ అభివృద్ధి కోసం ప్రజల స్థితిగతులపై స్పష్టమైన సమాచారం అవసరం. జనాభా ఎంత? వయసు, లింగం, విద్య, నివాస స్థితి, వృత్తి వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించే ప్రక్రియకే జనగణన అంటారు.

What is Census in India? జనగణన ఎందుకు చేస్తారు?
ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల రూపకల్పన, వనరుల పంపిణీకి జనగణన డేటా అత్యంత కీలకం. ఉదాహరణకు:
- విద్యా సదుపాయాలు ఎక్కడ అవసరమో తెలియజేయడం
- వృత్తి ఆధారంగా ఉద్యోగ అవకాశాల ప్రణాళిక
- పట్టణం–గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి
గత కాలం నుండి ఇప్పటి దాకా
భారతదేశంలో మొదటి జనగణన 1872లో ప్రారంభమైంది. తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొనసాగుతోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. అప్పుడు దేశ జనాభా 121 కోట్లు (121Cr)గా నమోదైంది.
తాజా జనగణన విశేషాలు
2021లో జరగాల్సిన జనగణన, కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం 16వ జనగణన నోటిఫికేషన్ వెలువడనుంది, 2027 మార్చి 1ను ప్రామాణిక తేదీగా తీసుకుంటారు. ఈసారి కుల గణన (Caste Census) కూడా చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జనగణన ద్వారా మనం దేశ స్థితిగతులపై పూర్తిగా అవగాహన పొందగలుగుతాము. ప్రభుత్వానికి ఇది మార్గదర్శకంగా మారుతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “What is Census in India : భారతదేశంలో జనగణన అంటే ఏమిటి?”