BJP VMD: రాజన్న ఆలయ మూసివేతపై అఖిలపక్షం మరియు హిందూ పరిరక్షణ కమిటీల మీడియా సమావేశం ఆలయ అభివృద్ధి పేరిట జూన్ 15 ఆలయం మూసివేత పై అభ్యంతరం తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం 5:00గంటలకు పట్టణ పద్మశాలి సంఘం (శూభాష్ నగర్ రోడ్) హిందు పరిరక్షణ సంఘాలు,ఆఖిల పక్షం ఈనెల 14న పట్టణం బంద్ పిలుపు నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో ప్రధాన డిమాండ్లతో పాటు కరపత్రాలు విడుదల మరియు వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్యక్షా కార్యవర్గ సభ్యుల పేర్ల ప్రకటన ముఖ్య ఉద్దేశం కావున దయచేసి మీడియా మిత్రులు రావాల్సిందిన విన్నపం.


రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణ గారు ప్రధాన కార్యదర్శిగా రామతీర్థపు రాజు గారిని ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నుకొని కార్యచరణ రూపొందించి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగా మే 14 బుధవారం రోజున వేములవాడ పట్టణ సంపూర్ణ బందుకు పిలుపునివ్వడం జరిగింది.