Vemulawada Gosala Inspection 2025 : గోవుల సంరక్షణపై కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు

TELANGANA PATRIKA (MAY 12) , Vemulawada Gosala Inspection 2025: శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గోవుల సంక్షేమం పట్ల అధికారుల దృష్టిని మరింత కేంద్రీకరించారు. తిప్పాపూర్ లోని గోశాలలో గోవులకు అందిస్తున్న మేత, నీరు, షెడ్ల పరిస్థితులపై సమగ్రంగా తనిఖీ చేశారు.

Join WhatsApp Group Join Now

Vemulawada Gosala Inspection 2025 కలెక్టర్ ఆదేశాలు ముఖ్యాంశాలు:

  • షెడ్లలో నిల్వ గడ్డిని తరలించి, కోడేలకు కేటాయించాలి
  • ప్రతి గోవుకు జియో ట్యాగింగ్ పరికరం ఏర్పాటు చేయాలి
  • ఫాగర్స్ (నీటి తుంపర్ల యంత్రాలు) ప్రతీ షెడ్‌లో అమర్చాలి
  • గోవుల వయస్సును బట్టి షెడ్లు వేరు చేయాలి
  • తాగునీరు, మేత నాణ్యతను ప్రతి రోజు పర్యవేక్షించాలి
  • గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలి
  • పచ్చిగడ్డిని మరింత సమృద్ధిగా అందించాలి:

ఎండాకాలం కావడంతో గోవులకు పచ్చిగడ్డి, నీరు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. భవిష్యత్తులో కోడెల పంపిణీ తర్వాత కూడా గోవుల లొకేషన్ ట్రాకింగ్ కోసం జియో ట్యాగింగ్ తప్పనిసరి అని తెలిపారు.

హాజరైన అధికారులు:

ఈ తనిఖీ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్, జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి, ఏఈవో శ్రీనివాస్, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు. అనంతరం గోవులకు వ్యాధి నివారణ టీకాలు వేసారు.

Also Read : Drunk and Drive Counseling Telangana: వేములవాడలో వాహనదారులకు పోలీసుల అవగాహన కార్యక్రమం

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.