TELANGANAPATRIKA (June 10) : Vemulawada Development Works. వేములవాడ పట్టణంలోని 7, 8, 11, 12 వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Vemulawada Development Works వార్డుల్లో అభివృద్ధి పనులు
ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, పట్టణంలోని 28 వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించేందుకు మూడు కోట్ల పైగా నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజల సూచనల ఆధారంగా పనులు మొదలవుతున్నాయని చెప్పారు.
రాజన్న ఆలయ అభివృద్ధి ప్రణాళికలు
రాజన్న ఆలయ పరిసర ప్రాంత అభివృద్ధికి ఇప్పటికే రూ.76 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. శృంగేరి పీఠాధిపతి అనుమతితో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఆలయ చెరువులోకి వచ్చే మురుగు నీటిని దారి మళ్లించేందుకు 9 కోట్లతో ప్రాజెక్ట్ రూపొందించామని చెప్పారు.
మూడవ బ్రిడ్జి నిర్మాణం
గత ప్రభుత్వ హయాంలో భూమిపూజ జరిగినా పనులు ప్రారంభం కాలేదని పేర్కొంటూ, ఈసారి నిజంగా నిర్మాణం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్వాసితులకు రూ.6 కోట్ల నష్టపరిహారం జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.
యంగ్ ఇండియా స్కూల్ కాంప్లెక్స్
వేములవాడ పట్టణానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేసినట్లు తెలిపారు. తొమ్మిది నెలల్లో సుమారు 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందని వివరించారు.

Read More: Read Today’s E-paper News in Telugu