మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన వేములవాడ పట్టణ బిజెపి నేతలు..!

TELANGANA PATRIKA(MAY25) , వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 122వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగాన్ని కార్యకర్తలు, ప్రజలు శ్రద్ధగా విన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమై ఉన్నదని, యువత పెద్ద సంఖ్యలో తిరంగా యాత్రల్లో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో చేతివృత్తుల ప్రోత్సాహం – స్వయం శాఖల పురోగతి

ప్రధాని మోడీ స్వయం శాఖ సంఘాలను, సాంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహించాలన్న పిలుపు నిచ్చారు. గ్రామీణాభివృద్ధిలో వీటి పాత్ర కీలకమని, యువత వీటిని వృత్తిగా తీసుకుని అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.

వ్యవసాయ వినియోగంలో డ్రోన్ల ప్రాధాన్యత

వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని సమర్థిస్తూ, సంగారెడ్డిలో మహిళలు సాగు పనుల్లో డ్రోన్లను వినియోగిస్తున్నందుకు ప్రధాని మోడీ వారిని ప్రశంసించారు. సాంకేతికతను గ్రామీణ వ్యవసాయంలో వినియోగించటం కొత్త దారులు తెరుస్తుందని పేర్కొన్నారు.

యోగా దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా పిలుపు..

జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రజలందరూ పాల్గొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, రేగుల శ్రీకాంత్, అన్నం నరసయ్య, వెంకటస్వామి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Also Read: వేములవాడలో బీజేపీ తిరంగా యాత్ర కు విశేష స్పందన: భారీగా పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *