తెలంగాణ పత్రిక (APR.21) : UPI down. ఇంటర్నెట్ డెస్క్ – దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) సేవలు శుక్రవారం మళ్లీ అంతరించాయి. డిజిటల్ చెల్లింపులు చేసే యాప్లు – గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి వాటిలో పేమెంట్ ఫెయిల్యూర్లు ఎదురవుతున్నాయని వందలాది మంది వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలిపారు.


ప్రముఖ ట్రాకింగ్ సైట్ ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం, మధ్యాహ్నం 12 గంటల సమయంలో 1000 మందికిపైగా యూపీఐ సేవలలో అంతరాయం గురించి ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది. ‘‘సాంకేతిక సమస్య వల్ల UPI సేవల్లో తాత్కాలిక అవాంతరం ఏర్పడింది. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలిగిన అసౌకర్యానికి క్షమించండి’’ అంటూ ‘ఎక్స్’లో (Twitter) పోస్ట్ చేసింది.
ఇదివరకూ కూడా మార్చి 26, ఏప్రిల్ 2 తేదీల్లో ఇదే విధంగా యూపీఐ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడినట్లు గుర్తుండాలి. అదే విధంగా, తాజా ఘటనతో పాటు ఇటీవల తరచూ ఈ సమస్యలు ఎదురవుతుండటంతో వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఇంటర్ ఫలితాలను వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా తెలుసుకునే విధానం తెలుగులో.