Telanganapatrika (August 15): తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న దసరా సెలవుల తేదీలను రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాల దసరా సెలవుల టైమ్టేబుల్..
ఆంధ్రప్రదేశ్లో — రాష్ట్ర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు మంజూరు చేశారు. అయితే, క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉంటాయి.
తెలంగాణలో — పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా బ్రేక్ ప్రకటించారు. అదనంగా, రాష్ట్రంలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇవ్వబడింది.
దీంతో, విద్యార్థులు సుదీర్ఘ విరామాన్ని ఆస్వాదించడానికి సన్నద్ధమవుతున్నారు. పండుగ సందడి, కుటుంబ సమయాన్ని ఆస్వాదించే ఈ కాలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu