Telangana Retirement Dues High Court: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ డ్యూస్పై తెలంగాణ హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. Telangana High Court ప్రభుత్వం అన్ని బకాయిలను ఏప్రిల్ 9లోపు చెల్లించాలని ఆదేశించింది.

ఈ నిర్ణయం వేలాది రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిచ్చింది.
Telangana Retirement Dues High Court చెల్లించాల్సిన డ్యూస్ ఏవి?
రిటైర్డ్ ఉద్యోగులు పొందాల్సిన ముఖ్యమైన లాభాలు:
- పెన్షన్ ఫండ్
- గ్రాట్యుటీ
- ఎర్న్డ్ లీవ్స్ నగదు
ఈ మొత్తం చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.
గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు/ గత సంవత్సరం కూడా హైకోర్ట్ ప్రభుత్వం కు 10 వారాల్లో డ్యూస్ చెల్లించాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఆ ఆదేశాలను పూర్తిగా అమలు చేయలేకపోయింది.
అధికారులపై కోర్టు ఆగ్రహం
ఈ కేసులో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి Sandeep Kumar Sultania పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు కోరడం విచారణలో ఆలస్యం చేయడం ఇవి కోర్టును ఆగ్రహానికి గురి చేశాయి.
ఎంతమందికి డ్యూస్ చెల్లించారు?
ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాలు:
- మొత్తం రిటైర్డ్ ఉద్యోగులు: 3,656
- ఇప్పటివరకు చెల్లించినవి: 1,056 మందికి
- మిగిలిన వారికి ఇంకా చెల్లింపులు పెండింగ్
ప్రభుత్వం మార్చి 31లోపు పూర్తి చేస్తామని తెలిపినా, కోర్టు అంగీకరించలేదు.
ఏప్రిల్ 9 డెడ్లైన్
జస్టిస్ రావు స్పష్టం చేశారు. మరింత సమయం ఇవ్వలేము, ఏప్రిల్ 9లోపు అన్ని చెల్లింపులు పూర్తి చేయాలి. ఇది ప్రభుత్వం పై కఠిన ఆదేశంగా భావిస్తున్నారు.
హైకోర్ట్ ఈ నిర్ణయం రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఊరట. ఆలస్యం లేకుండా డ్యూస్ చెల్లింపులు, ఉద్యోగుల హక్కులకు రక్షణ ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వ వ్యవస్థలో బాధ్యతను పెంచుతాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
