TELANGANAPATRIKA (June 16): Telangana farmer scheme. తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్-2025 వానాకాలం పంటల కోసం “రైతు భరోసా” పథకానికి కొత్తగా పట్టాలు పొందిన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Telangana farmer scheme ఖరీఫ్ పంటల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
వీణవంక మండల వ్యవసాయ అధికారి గణేష్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 జూన్ 5 తేదీ లోపు ధరణి లేదా భూ భారతి పోర్టల్స్లో నమోదు అయిన కొత్త పాసుబుక్కుల రైతులు ఈ పథకానికి అర్హులు.
రైతులు కింది డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది:
- రైతు భరోసా అప్లికేషన్ ఫారం
- పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
గమనిక: గతంలో ఇప్పటికే ఈ పథకానికి నమోదు అయిన రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
Telangana farmer scheme చివరి తేదీ: జూన్ 18, 2025
అప్లికేషన్లు ఈ నెల 18వ తేదీ లోపు సంబంధిత AE (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్) అధికారికి ఇవ్వాల్సిందిగా సూచించారు. అప్లికేషన్ ప్రక్రియ, సంబంధిత దస్తావేజుల పరిశీలన అనంతరం పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Telangana farmer scheme : రైతులకు దరఖాస్తుల ఆహ్వానం”