Telangana patrika (June 3 ): Telangana Chenetha Bheema Scheme 2025, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల భద్రతను దృష్టిలో ఉంచుకొని, 2025లో నూతనంగా ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది. జియో ట్యాగ్ చేసిన చేనేత మగ్గాలపై పనిచేసే నేతన్నలకు ఏటా రూ.18,000 చొప్పున రెండు విడతల్లో ఆర్థిక సాయం అందించనున్నారు. అనుబంధ కార్మికులకు రూ.6,000 ప్రోత్సాహం లభించనుంది.


Telangana Chenetha Bheema Scheme 2025
ఈ పథకం ద్వారా సుమారు 40 వేల మంది నేతన్నలు మరియు కార్మికులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయించి, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ పథకం ప్రత్యేకతలు:
- Geo-tag చేసిన మగ్గాలపై పనిచేసే నేతన్నలకే అర్హత
- ఏటా రెండు విడతల్లో రూ.18,000 ప్రోత్సాహం
- అనుబంధ కార్మికులకు ప్రత్యేకంగా రూ.6,000
- మొత్తం లబ్దిదారులు: సుమారు 40,000 మంది
- మొత్తం బడ్జెట్: రూ.48 కోట్లు
ఈ పథకం ద్వారా చేనేత రంగానికి భరోసా, అలాగే ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇది తెలంగాణ నేతన్నల జీవితాలలో పెద్ద మార్పును తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Read More: Khammam sand smuggling: జోరుగా మట్టి తోలకాలు -అధికారులు కనుసైగల్లోనే దందా