
TELANGANA PATRIKA(MAY26) , సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల నిరసనలతో రాజకీయ ఉద్రిక్తత తలెత్తింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటోను ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ముఖ్యంగా గంభీరావుపేట మండలంలో ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో కేటీఆర్ ఫోటో లేకపోవడం ఈ ఉద్రిక్తతకు కారణమైంది.
సిరిసిల్లలో ప్రోటోకాల్… కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం, తోపులాట
సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ పాటించాలని కోరితే క్యాంపు కార్యాలయంపైకి దాడి ఎందుకని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఈ సమయంలో ఇరు పార్టీల మధ్య తోపులాట తలెత్తింది.
పోలీసులు లాఠీచార్జ్ – నాయకుల అరెస్ట్
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరుపక్షాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురు నాయకులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు పలువురు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతలను తంగలపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు:
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘన, పోలీసులు ఒకపక్షంగా వ్యవహరించడం పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులపై నినాదాలు చేస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
Also Read : సిరిసిల్ల: ప్రోటోకాల్ విరుద్ధంగా కలెక్టర్ చర్యలు – సర్పంచ్ ఫోరం ఆగ్రహం
One Comment on “సిరిసిల్లలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై నిరసనలు….”