తెలంగాణ పత్రిక (APR.30) , భారతీయ రైల్వేలో RRB Group D 2025 గ్రూప్ D స్థాయి ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా భారీ స్పందన నమోదైంది. 2025 మార్చి 1వ తేదీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం, మొత్తం 1.08 కోట్ల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్లు రైల్వే నియామక బోర్డు వెల్లడించింది. ముంబయి ప్రాంతం నుండి మాత్రమే 15.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి, ఇది అత్యధికంగా ఉంది.

RRB Group D 2025 ప్రభుత్వ ఉద్యోగుల పోటీ తీవ్రత
కేవలం 32,438 ఖాళీలకు 1.08 కోట్ల దరఖాస్తులు వచ్చాయని చూస్తే, ఒక పోస్టుకి సగటున 330 మంది పోటీ పడుతున్నట్లు అర్థమవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని, ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆసక్తి ఎందుకు అంటే భద్రత, పెన్షన్ లాభాలు, నెలనెలా ఖచ్చితమైన జీతం — ఇవే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రధాన ఆకర్షణలు. ప్రైవేట్ రంగంలో వృద్ధి ఉన్నా, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి కారణంగా యువత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ రంగ వైపు మొగ్గుచూపుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu

Comments are closed.