TELANGANA PATRIKA (MAY 15) ,Ration news Telangana: హైదరాబాద్ , వర్షాకాలంలో తిండి ధాన్యాల నిల్వల సమస్యలు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ నుండి ప్రారంభమయ్యే వర్షాకాలం, వరదల కారణంగా రవాణాలో తలెత్తే సమస్యలను నివారించేందుకు జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) పరిధిలో వచ్చే జూన్, జూలై, ఆగస్టు 2025 నెలలకు చెందిన రేషన్ను ముందస్తుగా పంపిణీ చేయాలని కేంద్రం సూచించింది.

కేంద్ర ఆదేశాల ముఖ్యాంశాలు:
- అన్ని రాష్ట్రాలు మే 30లోపు మూడు నెలల రేషన్ సరఫరాను పూర్తి చేయాలి.
- భారత ఆహార సంస్థ (FCI) గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు FCIతో సమన్వయం చేస్తూ సరఫరా జరపాలి.
ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి.
Ration news Telangana రాష్ట్రంలో మూడు నెలల బియ్యం పంపిణీకి సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమాచారమిచ్చింది — జూన్లో మూడు నెలల రేషన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు. ప్రతి నెలకు సగటున 1.75 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతుండగా, మొత్తం మూడు నెలలకు 5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేయటంతో, నిల్వలను సమీకరించి గోడౌన్ల నుండి రేషన్ పంపిణీకి సిద్ధమవుతోంది.
వర్షాకాలానికి ముందస్తు భద్రత
వర్షాకాలంలో రవాణా అంతరాయాలను తగ్గిస్తూ, లబ్ధిదారులకు సమయానికి రేషన్ అందించేందుకు ఇది చాలా కీలక చర్య అని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలకు తిరుగులేని ప్రయోజనం కలిగించే విధంగా ఈ ముందస్తు పంపిణీ ప్రయోజనకరమవుతుంది.
Also Read : New Ration Cards Telangana: అర్హులందరికీ రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
4 Comments on “Ration news Telangana : మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ..!”