TELANGANA PATRIKA(JUN 5) , Rajanna Sircilla , రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఇటీవల మంజూరైన ఇండ్ల లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారిని గురువారం కలిశారు. మంజూరైన పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వ్యక్తిగతంగా కలెక్టర్ను కలిసి తమ ఆనందాన్ని, కృతజ్ఞతను తెలిపారు.

Rajanna Sircilla కలెక్టర్కు లబ్ధిదారుల కృతజ్ఞతలు..
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ నాయక్, గ్రామ నాయకులు అక్కపల్లి బాలయ్య, లక్కం నాంపల్లి తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ – “ఇందిరమ్మ ఇండ్లు అనేది మా కలల ప్రాజెక్ట్.. ఈ మంజూరు పత్రాల ద్వారా మా కల నిజమైంది” అని వ్యాఖ్యానించారు.
మంజూరైన ఇళ్లతో బీసీ వర్గాలుకు భరోసా
ఈ ఇంటి మంజూరుతో గ్రామంలోని మధ్యతరగతి, బీసీ వర్గాలకు ఒక స్థిర నివాసం కలుగుతుంది. దీనివల్ల పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఎంత ముఖ్యమో మరోసారి నిరూపితమైంది.
Read More: Read Today’s E-paper News in Telugu