Police Akka: పోలీస్ అక్క ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో గతంలో పోక్సో కేసు బాధితులు మరియు అత్యాచారానికి గురి అయిన బాధితులకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ భరోసా నిధుల నుండి ఆ బాధిత మహిళలకు , మైనర్ ఆడ పిల్లలకు ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల అందజేశారు. గురువారం జిల్లా ఎస్పీ ముఖ్య కార్యాలయంలో మొత్తం 9 అత్యాచార మహిళా బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని వేదింపులు, అత్యాచారం, బాధిత మహిళలకు, పిల్లలకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజికల్ సమస్యలను ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీసు ఊమెన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను అక్కున చేర్చుకొని, కొండంత ధైర్యాన్నిస్తూ, మహిళలు, పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ అన్నారు. గతంలో చిన్న చిన్న మనస్పర్థలతో దూరంగా ఉంటున్న కుటుంబాలకు భరోసా సిబ్బందితో కౌన్సిలింగ్ ఇచ్చి సుమారు 50 కి పైగా కుటుంబాలని కలపటం జరిగింది. జిల్లాలో మహిళల భద్రత కోసం వారి వెన్నతో ఉంటూ షి టీమ్, భరోసా సిబ్బందితో మహిళల భద్రత కోసం నిరంతరం జిల్లా పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కోర్టు లో విచారణ లో ఉన్న పోక్సో మరియు అత్యాచార కేసులను నిరంతరం ఒక ప్రత్యేక పోలీస్ అధికారులతో ఎస్పీ సూచనలతో అపరాధులకు శిక్షలు పడేవరకు ప్రాసిక్యూషన్ అధికారుల సహాయంతో సాక్షులను ప్రవేశపెట్టి నేర నిరూపణ చేయటం జరుగుతుంది. దీని ఫలితంగా గత సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు 9 కేసుల్లో నేర నిరూపణ అయ్యి దోషులకు శిక్షలు పడ్డాయి అని తెలియజేసారు. ఇటువంటి కేసుల పర్యవేక్షణ కోసం ఆదిలాబాద్ కోర్టులో జిల్లా నుండి ఒక పర్యవేక్షణాధికారిని నియమించటం జరిగింది. జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు చాలా తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పి తో పాటు భరోసా ఇన్చార్జి మహిళా ఎస్ఐ పెర్సిస్, భరోసా సిబ్బంది జ్యోతి, శిరీష, స్వప్న, సుమలత పాల్గొన్నారు.

Also Read: మైనర్లకు వాహనాలు ఇస్తే ఇక జైలుకే|IPS Sai chaitanya
One Comment on “పోక్సో బాధితులకు అండగా -Police akka – ప్రోగ్రాం ద్వారా మేమున్నాం అంటూ భరోసా|డా.జి.జానకి షర్మిల”