తెలంగాణ పత్రిక (APR.08) : IPS Sharath Chandra Pawar: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని, పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు యాక్ట్ 30, 30(ఎ) – 1861 ప్రకారం, జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని, పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు యాక్ట్ 30, 30(ఎ) – 1861 ప్రకారం, వచ్చే నెల రోజులపాటు ఈ చట్టం కి సమ్మబంధించినవన్నీ నిబంధనలు జిల్లాలో అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నేపథ్యంలో, పోలీసుల అనుమతి లేకుండా ఎవరూ కూడా:
- ధర్నాలు
- రాస్తారోకోలు
- నిరసనలు
- ర్యాలీలు
- పబ్లిక్ మీటింగ్స్
- సభలు, సమావేశాలు
పెట్టరాదని స్పష్టం చేశారు. ప్రజల ఆస్తి, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు చేపట్టినవారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులు చేపట్టిన చర్యలకు పూర్తిగా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Read More: Rajanna Sircilla 2025: సిరిసిల్లలో మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత – ఎస్పీ మహేష్ గితే
One Comment on “IPS Sharath Chandra Pawar: జిల్లా వ్యాప్తంగా 30-30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలు ఎస్పి శరత్ చంద్ర పవార్”