తెలంగాణ పత్రిక (APR.25) : Pahalgam Attack Protest 2025: రాజన్న సిరిసిల్ల: పహల్గామ్ దాడిపై మజీద్ కమిటీ నిరసన ర్యాలీ
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయకులపై జరిగిన ఉగ్రదాడిని సిరిసిల్ల మజీద్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 26 మంది నిర్దోషులు ప్రాణాలు కోల్పోయిన దుర్విషయం పట్ల మండిపడ్డ మజీద్ కమిటీ నాయకులు, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జామే మజీద్ నుంచి గాంధీ చౌక్ వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. “పాకిస్తాన్ డౌన్ డౌన్” వంటి నినాదాలతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం సృష్టించారు.

Pahalgam Attack Protest 2025 కమిటీ నేతల వ్యాఖ్యలు:
ఈ సందర్భంగా మజీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ,
“భారతదేశంలో హిందూ ముస్లిం సోదరతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు మతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు చేస్తూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మేము మద్దతుగా ఉన్నాం. దేశాన్ని కల్లోలం చేస్తోన్న ఉన్మాదులను తుదముట్టించాల్సిందే.” అని అన్నారు.
