Nizamabad News నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ( తెలంగాణ పత్రిక ) మే 14: రోడ్డు ప్రమాదంలో అన్నాదమ్ములు ఇద్దరు దు*ర్మరణం చెందారు. ఈ ఘటన ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతి చెందగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని దోభీగల్లీకి చెందిన కొండూరు నాగేంద్ర (19), కొండూరు అర్జున్ (21) హైదరాబాద్ లో ఉంటున్నారు. ఒకరు ఏసీ మెకానిక్ గా పని చేస్తుండగా, మరొకరు హోటల్ మేనేజ్ మెంట్ చదువుతున్నారు. మెట్ పల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుని ఇద్దరు కన్నుమూశారు.


Read More: నేరేడిగొండ పోలీస్ స్టేషన్లో పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ప్రారంభం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్