
Nitish Kumar CM Bihar 2025: బీహార్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దారి సిద్ధమైంది. विधानसभा లో BJP అతిపెద్ద పార్టీగా నిలిచినా, సీఎం పదవి మాత్రం మళ్లీ జేడీయూ అధినేత నితీష్ కుమార్దే అవుతోంది.
తాజాగా నితీష్ కుమార్ గవర్నర్కు తన రాజీనామా సమర్పించారు. ఇది కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు జరిగే సాధారణ ప్రక్రియ మాత్రమే. ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దు చేసి, కొత్త కేబినెట్ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తున్నారు.
Nitish Kumar CM Bihar 2025
బీహార్ BJP అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఇప్పటికే నిర్ధారించినట్టు, నితీష్ కుమార్ నవంబర్ 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంతో ఆయన పదోసారి బీహార్ సీఎం అవడం చరిత్రాత్మకం.
జేడీయూ బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుండగా, వచ్చే కేబినెట్లో BJPకి ఎక్కువ స్థానాలు ఉండనున్నాయి. నవంబర్ 20 బీహార్ రాజకీయాల్లో కీలకమైన రోజుగా నిలవనుంది ఒక వైపు నితీష్ కుమార్ మరోసారి సీఎం పీఠం చేపడుతుండగా, మరోవైపు కొత్త మంత్రివర్గం కూడా అధికారికంగా ప్రారంభమవుతుంది.
బీహార్ అభివృద్ధి, పరిపాలనలో కొత్త దశకు ఇది ప్రారంభం అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
