Musi River Project: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ను విజయవంతం చేయడానికి ప్రజల సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. హైదరాబాదులోని అంబర్పేట్ బతుకమ్మకుంట ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన, ముసీ నది శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వంకట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Musi River Project ముసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – “ముసీ నది పునరుద్ధరణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రజలు కూడా చురుకుగా ముందుకు రావాలి. ప్రతి పౌరుడు సహకరిస్తేనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది” అన్నారు.
నగరంలో ఒక్క గంట వర్షం పడినా ముసీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తుచేసిన సీఎం, ఇలాంటి సమస్యలు ఇక మళ్లీ రాకుండా శాస్త్రీయంగా పునరుద్ధరణ చర్యలు చేపడతామని తెలిపారు. ఈ క్రమంలో వివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అలాగే, ముసీ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, భూమి ఆక్రమణలు ప్రజల భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరిస్తూ, అక్రమ ఆస్తులు కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “Musi River Project : సీఎం రేవంత్ ముసీ పునరుజ్జీవనం నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం?”