
TELANGANA PATRIKA(MAY27) , MLA Aadi Srinivas , వేములవాడ నియోజకవర్గంలోని వట్టెంల గ్రామంలో 22 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, వీరిలో ఒకరు అంధుడు రంగు ఎల్లయ్య గారు.
ఎన్నికల హామీకి నిలబడి నిజం చేసిన మాట
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆది శ్రీనివాస్, “ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని” అంధుడు ఎల్లయ్యకి హామీ ఇచ్చారు. ఆ హామీ ఎన్నికల తరువాత కూడా నిలబెట్టుకొని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆది శ్రీనివాస్ తన మాట నిలబెట్టుకొని ఎల్లయ్యకు ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేశారు.
MLA Aadi Srinivas ను ఏడుకొండల వెంకన్న దయగా భావించిన ఎల్లయ్య
ఈ సందర్భంగా రంగు ఎల్లయ్య భావోద్వేగంగా మాట్లాడుతూ:
“నేను ఏడుకొండల వెంకన్నకు మొక్కుకున్నాను. నా కష్టాన్ని చూసి ఆయన ఆది శ్రీనివాస్ రూపంలో స్పందించారు. ఇప్పుడు నా కల నిజమైంది.”
అయన మాటలలో స్పష్టంగా కనిపించింది — ప్రభుత్వ పథకాలు కేవలం పత్రాల్లో కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తేవగలవని.
ప్రజలు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు
ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎంపిపి రంగు వెంకటేశంకు గ్రామస్థులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అంధుడి కల నెరవేరిన సందర్భంగా వట్టెంల గ్రామమంతా ఆనందంలో మునిగిపోయింది
Read More: Read Today’s E-paper News in Telugu